రైతు బంధు పై ఈనెల 7వ తేదీన సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2020-12-05T21:47:16+05:30 IST

రాష్ట్రంలో రైతుబంధు పై ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యవసాయ, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

రైతు బంధు పై ఈనెల 7వ తేదీన సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుబంధు పై ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యవసాయ, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో ఈ ఏడాది రెండోవిడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీ పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి , ఆర్ధికశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్ధిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. 

Updated Date - 2020-12-05T21:47:16+05:30 IST