నిర్మ‌ల్ పరిస్థితిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ కు కేసీఆర్ ఫోన్

ABN , First Publish Date - 2021-07-22T22:53:36+05:30 IST

నిర్మల్ పట్టణాన్ని వర్షం అతలాకుతలం చేస్తోంది.ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల

నిర్మ‌ల్ పరిస్థితిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ కు కేసీఆర్ ఫోన్

నిర్మల్: నిర్మల్ పట్టణాన్ని వర్షం అతలాకుతలం చేస్తోంది.ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప‌ట్ట‌ణంలోని వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌రిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


మ‌రో 24 గంట‌ల పాటు  అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టడానికి నిర్మ‌ల్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామ‌న్నారు.

Updated Date - 2021-07-22T22:53:36+05:30 IST