నారాయణగౌడ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి

ABN , First Publish Date - 2021-02-25T07:59:11+05:30 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ ఇటీవల మృతి చెందగా, మహబూబ్‌నగర్‌ సమీపంలోని పాలకొండ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం దశ దినకర్మ నిర్వహించారు.

నారాయణగౌడ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబాన్ని ఓదార్చిన సీఎం

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 24 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ ఇటీవల మృతి చెందగా, మహబూబ్‌నగర్‌ సమీపంలోని పాలకొండ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరై శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. నారాయణగౌడ్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మంత్రి తల్లి శాంతమ్మను ఓదార్చి, కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్నం 12:35కు పాలమూరు చేరుకున్న సీఎం.. తిరిగి 1:50 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2021-02-25T07:59:11+05:30 IST