‘నా ఫుల్ సపోర్ట్ మీకే’... కేసీఆర్కు మహారాష్ట్ర సీఎం ఫోన్
ABN , First Publish Date - 2022-02-16T17:03:24+05:30 IST
దేశం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
హైదరాబాద్: దేశం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. తమ ఆథిధ్యాన్ని అందుకోవాలని కోరారు. ఉద్ధవ్ థాకరే ఆహ్వానం మేరకు ఈనెల 20న కేసీఆర్ ముంబైకు వెళ్లనున్నారు. "కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం.. మీరు ముంబైకి రండి...మా ఆథిధ్యాన్ని స్వీకరించండి...అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దాం" అంటూ సీఎం కేసీఆర్కు ఉద్ధవ్ థాకరే తెలిపారు.