నేటి సాయంత్రం బెంగుళూరుకు కేసీఆర్.. ప్రధాని టూర్‌కు మరోసారి దూరం

ABN , First Publish Date - 2022-05-25T17:24:21+05:30 IST

ఇవాళ సాయంత్రం బెంగుళూరుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు ప్రధాని టూర్‌కు మరోసారి కేసీఆర్ దూరం కానున్నారు.

నేటి సాయంత్రం బెంగుళూరుకు కేసీఆర్.. ప్రధాని టూర్‌కు మరోసారి దూరం

హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం బెంగుళూరుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు ప్రధాని టూర్‌కు మరోసారి కేసీఆర్ దూరం కానున్నారు. రేపు బెంగుళూరు నుంచి రాలె గావ్ సిద్ధి వెళ్లనున్నారు. అటు నుంచి కుటుంబ సబ్యులతో కలిసి షిర్డీ వెళ్లి అక్కడ సాయినాథున్ని దర్శించుకోనున్నారు. కాగా.. 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గతంలో కూడా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో అప్పటి ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి బెంగుళూరు టూర్ కారణంగా దూరం కానున్నారు. కేసీఆర్ కావాలనే ఇలా చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2022-05-25T17:24:21+05:30 IST