బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-01-12T20:40:39+05:30 IST

ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఉపసంమరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాయనున్నారు. ఈ నిర్ణయంతో బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిర్ధారణ అయిందన్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చారు.


దేశవ్యాప్తంగా.. రైతాంగపరంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపట్ల ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. మరోసారి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎండగట్టేందుకు రాబోయే రోజుల్లో బీజేపీయేతర పార్టీలను ఏకధాటిపైకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి పూనుకున్నట్లు ఈ లేఖ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

Updated Date - 2022-01-12T20:40:39+05:30 IST