ప్రముఖ కవి దేవిప్రియ మృతికి కేసీఆర్‌ సంతాపం

ABN , First Publish Date - 2020-11-21T20:37:30+05:30 IST

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు

ప్రముఖ కవి దేవిప్రియ మృతికి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. దేవిప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’ రచన మచ్చుతునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-11-21T20:37:30+05:30 IST