ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-03-09T02:51:04+05:30 IST
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ కోరారు. 12 మార్చి, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 12 న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో, వరంగల్ పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దేశంలో స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందన్నారు.