నేడు కుప్పానికి సీఎం జగన్
ABN , First Publish Date - 2022-09-23T09:01:13+05:30 IST
నేడు కుప్పానికి సీఎం జగన్
తిరుపతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ శుక్రవారం కుప్పంలో పర్యటిస్తున్నారు. చేయూత లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో 10.05 గంటలకు ముఖ్యమంత్రి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్లో కుప్పం వెళతారు. తిరిగి తిరుపతి విమానాశ్రయం చేరుకుని, 1.55 గంటలకు విజయవాడ వెళ్తారు.