పీఆర్సీపై సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్: సూర్యనారాయణ

ABN , First Publish Date - 2021-12-14T03:05:58+05:30 IST

పీఆర్సీపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ కాలయాపన కోసమేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కమిటీ నియామకం, నివేదికలు ఎలా ఉన్నా..

పీఆర్సీపై సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్: సూర్యనారాయణ

అమరావతి: పీఆర్సీపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ కాలయాపన కోసమేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కమిటీ నియామకం, నివేదికలు ఎలా ఉన్నా సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెడితే...కొన్ని సంఘాలు ముందే నిరసనలు మొదలు పెట్టాయని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నిరసనల్లో ఉద్యోగుల మద్దతు కనిపించడం లేదన్నారు. నిరసనల పేరుతో సంఘాల నేతలు ఓ అరగంట ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు సంఘాలు రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు చేస్తున్నాయని, ఏదో ఆశించి రెండు నెలల్లో రిటైర్డ్ అవుతున్న NGO నేత బండి శ్రీనివాస్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల దోస్తాం అని ఉద్యోగ సంఘాల నేతలు సవాళ్లు చేస్తున్నారని సూర్యనారాయణ తెలిపారు. 


Updated Date - 2021-12-14T03:05:58+05:30 IST