కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దాం: సీఎం జగన్
ABN , First Publish Date - 2021-07-17T03:08:44+05:30 IST
సీఎం జగన్తో జలవనరులశాఖ అధికారుల సమావేశం అయ్యారు. కేఆర్ఎంబీ
అమరావతి: సీఎం జగన్తో జలవనరులశాఖ అధికారులు సమావేశం అయ్యారు. కేఆర్ఎంబీ పరిధి గెజిట్ నోటిఫికేషన్పై చర్చ జరిగింది. బోర్డు పరిధి మనం కోరుకున్నదేనని, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దామని సీఎం జగన్ చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్లోని లోపాలపై దృష్టి పెట్టాలని జలవనరులశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. లోపాలను సరిదిద్దాలని కేంద్రానికి లేఖ రాద్దామని జగన్ అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా కేంద్రానికి లేఖ రాద్దామని సీఎం జగన్ సూచించారు.