సీఎం జగన్ పై దేవినేని కామెంట్స్
ABN , First Publish Date - 2020-08-10T01:47:49+05:30 IST
సీఎం జగన్ పై దేవినేని కామెంట్స్
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 236 రోజుల నుంచి ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం కొనసాగుతోందని, 74 మంది ఆత్మబలితానాలు చేసుకున్నారని దేవినేని ఉమ అన్నారు. ఈ అంశంపై ఉన్నతన్యాస్థానం 14వ తేదీ వరకు స్టేటస్ కొ ఇచ్చిదని, ఐదు కోట్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారని దేవినేని తెలిపారు. అయినా మీ మూడుముక్కలాటలో భాగంగా ఉత్తరాలు రాయడం, శంకుస్థాపనకు ఆహ్వానించడం పట్ల ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సీఎం జగన్ ను దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.