అమర జవాన్ కుటుంబానికి రూ.50లక్షలు సాయం: సీఎం జగన్
ABN , First Publish Date - 2021-07-09T19:42:45+05:30 IST
అమర జవాన్ జశ్వంత్రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. బద్వేల్ సభలో మాట్లాడుతూ.. జశ్వంత్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు
కడప: అమర జవాన్ జశ్వంత్రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. బద్వేల్ సభలో మాట్లాడుతూ.. జశ్వంత్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ప్రాణాలు ఫణంగా పెట్టారని, ఆయన త్యాగం నిరుపమానమైనదన్నారు. జశ్వంత్రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్లో గుంటూరు జిల్లాకు చెందిన జశ్వంత్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. నిన్న రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్రెడ్డి (23) మృతి చెందారు. ఐదేళ్ల క్రితం జశ్వంత్రెడ్డి సైన్యంలో చేరారు. జశ్వంత్రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.