రేపటి నుంచి సచివాలయ వ్యవస్థలో మార్పులు

ABN , First Publish Date - 2021-07-21T22:25:24+05:30 IST

రేపటి నుంచి సచివాలయ వ్యవస్థలో మార్పులు

రేపటి నుంచి సచివాలయ వ్యవస్థలో మార్పులు

అమరావతి: రేపటి నుండి సచివాలయ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి మార్పులు చోటుచేసుకోన్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న రిజస్టర్ సంతకం విధానానికి స్వస్తి చెప్పింది. రేపటి నుంచి అన్ని సచివాలయాల్లో బయో మెట్రికి విధానంను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఉద్యోగి ఆఫీసుకు వచ్చి, వెళ్లే సమయాల్లో తప్పని సరిగా బయోమెట్రిక్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి కూడా సచివాలయం పరిధిలోనే నివసించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారు ఎక్కడ ఉండేది... పంచాయతీ అధికారికి తెలియజేయాలన్నారు. 


అలాగే సచివాలయ ఉద్యోగి పూర్తి చిరునామా, వివరాలను అయా కార్యాలయాల్లో అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సూచన ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆయా జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా... సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించకున్నా కూడా సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీశాఖ హెచ్చరించింది. ఎక్కడైనా సాంకేతిక లోపం వస్తే... వెంటనే సంబంధిత అధికారికి చెప్పాలని సూచించింది. జులై నెల జీతం బయోమెట్రిక్‌తో లింక్ అయి వస్తుందని తెలిపారు. ఎన్నిరోజులు హాజరు ఉంటే  అన్ని రోజులకే జీతం వస్తుందన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి ఎల్ఎంఎస్ ద్వారా ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. వ్యవస్థ ప్రారంభించి రెండేళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ పూర్తవుతుందని పేర్కొంది. 

Updated Date - 2021-07-21T22:25:24+05:30 IST