విద్యాసంస్థల మూసివేత తగదు!

ABN , First Publish Date - 2021-03-31T05:41:23+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు మూసివేసింది. కానీ దీనివల్ల పేదపిల్లలు చదువుతోపాటు...

విద్యాసంస్థల మూసివేత తగదు!

కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు మూసివేసింది. కానీ దీనివల్ల పేదపిల్లలు చదువుతోపాటు, మధ్యాహ్న భోజనానికి దూరం అవుతున్నారు. పేద కుటుంబాల్లో పిల్లల ఆరోగ్యానికి ఆయువుపట్టుగా మారిన మధ్యాహ్న భోజనాన్ని ఆపివేయటం సబబు కాదు. పాఠశాలల మూసివేత వల్ల ధనిక, పేద పిల్లల మధ్య విద్యా, సామాజిక, సాంస్కృతిక అంశాల్లో అంతరాలు మరింత పెరుగుతాయి. కరోనా కాలంలో కూడా కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో ఆర్థికంగా లబ్ధిపొందుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు, తక్కువ ఫీజులతో నడిచే ప్రైవేట్ పాఠశాలలు దెబ్బతింటున్నాయి. ఈ చర్యవల్ల ఎటోచ్చీ పేదవారే నష్టపోతున్నారు. బార్లూ, రెస్టారెంట్లూ, పబ్బులూ, వైన్ షాపులూ, సినిమా థియేటర్లకు అనుమతులిస్తూ, కేవలం విద్యా సంస్థల విషయంలోనే మూసివేత ప్రకటించటం ఎంతవరకూ సమంజసం! 

శాగ శ్రీనివాస్, చిన్న పెండ్యాల

Updated Date - 2021-03-31T05:41:23+05:30 IST