నంద్యాల జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-16T12:59:48+05:30 IST

జిల్లాలోని మిడ్తూరు మండలం చౌట్కూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

నంద్యాల జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

నంద్యాల: జిల్లాలోని మిడ్తూరు మండలం చౌట్కూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ స్ధలం విషయంలో ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల్లోని వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-16T12:59:48+05:30 IST