న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదు: సీజేఐ రమణ
ABN , First Publish Date - 2021-11-10T01:11:17+05:30 IST
న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదని, సమాజ శ్రేయస్పు కోసం
హైదరాబాద్: న్యాయవాద వృత్తి ధనార్జన కోసం కాకూడదని, సమాజ శ్రేయస్పు కోసం పాటు పడాలని న్యాయ విద్యార్ధులకు సీజేఐ ఎన్వీ రమణ ఉద్భోద చేసారు. నల్సా ఆధ్వర్యంలో జరిగిన న్యాయసేవల దినోత్సవంలో సీజేఐ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ద్వారా సానుకూల పరిష్కారం సాధించగలిగితే దేశంలోని న్యాయస్థానాలపై భారం తగ్గిపోతుందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. సమాజం గురించి న్యాయ విద్యార్ధులు అర్ధం చేసుకోవాలని సూచించారు. న్యాయసేవా ఉద్యమానికి ఆధారం రాజ్యాంగంలోనే ఉందన్నారు. రాజ్యంగా పీఠికలో ప్రజలకు సామాజిక, ఆర్థిక, న్యాయం అందించాలనే భావన ఇమిడి ఉందని సీజేఐ రమణ అన్నారు.
ఈ సందర్భంగా సీజేఐ రమణ పనితీరు పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రశంసలు గుప్పించారు. న్యాయమూర్తులకు ఎక్కువ పని ఉండదన్న అభిప్రాయాన్ని సీజేఐ ఎన్వీ రమణ తొలగించారని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.