సివిల్స్ ర్యాంకర్ను అభినందించిన మంత్రి హరీష్
ABN , First Publish Date - 2020-08-05T02:17:19+05:30 IST
సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించిన సిద్దిపేట యువకుడిని మంత్రి హరీష్ రావు అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. సిద్దిపేటకు చెందిన మంద మకరంద్ అఖిల భారత సివిల్
హైదరాబాద్: సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించిన సిద్దిపేట యువకుడిని మంత్రి హరీష్ రావు అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. సిద్దిపేటకు చెందిన మంద మకరంద్ అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆల్ ఇండియా లేవల్లో 110వ ర్యాంకు సాధించాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. మకరంద్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియాలో 110 ర్యాంక్ సాదించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్కు శుభాకాంక్షలు. సిద్దిపేట బిడ్డగా తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపిన మకరంద్కు అభినందనలు. ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయిలో ఉండాలి.’’ అని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.