ABN ఎండీ రాధాకృష్ణపై కేసు ఎందుకు పెట్టారో సీఐడీ చెప్పాలి: నారాయణ, రామకృష్ణ
ABN , First Publish Date - 2021-12-13T02:27:33+05:30 IST
ABN ఎండీ రాధాకృష్ణపై కేసు ఎందుకు పెట్టారో సీఐడీ చెప్పాలి: నారాయణ, రామకృష్ణ
హైదరాబాద్: ABN ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు ఎందుకు పెట్టారో ఏపీ సీఐడీ చెప్పాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. పరామర్శించడానికి వెళ్తే వేమూరి రాధాకృష్ణపై కేసు పెడ్తారా? అని నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది చేయడమే తప్ప కాదనే స్థితిలో ఏపీ సీఐడీ లేదని, ఏపీలో వ్యక్తుల స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.
ABN ఎండీ వేమూరి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదును ఖండిస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఒకవేళ విధులకు అటంకం కలిగిస్తే పోలీస్ కేసు పెట్టకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. వేమూరి రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు కచ్చితంగా పైనుంచి వచ్చిన ఆదేశమే అని రామకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం బ్లాక్మెయిల్, బెదిరింపులకు పాల్పడుతోందని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.