ట్యాబ్ చుట్టూ విచారణ.. 6 గంటలుగా దేవినేనికి సీఐడీ ప్రశ్నలు
ABN , First Publish Date - 2021-05-04T23:41:23+05:30 IST
ట్యాబ్ చుట్టూ విచారణ.. 6 గంటలుగా దేవినేనికి సీఐడీ ప్రశ్నలు
అమరావతి: ఆరు గంటలుగా దేవినేని ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ కేసులో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. దేవేనేని ఉమ సోషల్ మీడియా పోస్టింగ్స్పై కూడా ఆరా తీశారు. సోషల్ మీడియా నిర్వహణ ఎవరు చూస్తోరో చెప్పాలని కోరారు. ట్యాబ్ ఎక్కడ అంటూ సుదీర్ఘంగా విచారించారు. ట్యాబ్ పోయిందని అధికారులకు ఉమ మరోసారి బదులిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో ట్యాబ్ ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు మొత్తం ట్యాబ్ చుట్టూ తిరుగుతోంది. బుధవారం మళ్లీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది.