ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎంకు ఎందుకంత కోపం?: లోకేష్
ABN , First Publish Date - 2021-01-21T20:59:19+05:30 IST
సీఎం జగన్పై టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎంకు ఎందుకంత కోపం
అమరావతి: సీఎం జగన్పై టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎంకు ఎందుకంత కోపం? అని ప్రశ్నించారు. అన్ని మతాలను సమానంగా చూడాలంటే అసహనం ఎందుకు అని నిలదీశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న ఇచ్చిన అనుమతి ఈ రోజు ఎందుకు రద్దయ్యింది? అని ప్రశ్నించారు. ధర్మ పరిరక్షణ యాత్రకి మతంరంగు ఎందుకు పూస్తున్నారని లోకేష్ నిలదీశారు.