చిత్తూరు ఆస్పత్రిలో పసికందు మాయం
ABN , First Publish Date - 2022-03-20T02:15:06+05:30 IST
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మాయమైంది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన రషీద్ భార్య షబానా
చిత్తూరు: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మాయమైంది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన రషీద్ భార్య షబానా ఈ నెల 12వ తేదిన పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరింది. 14న ఉదయం ఆపరేషన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కామెర్లుండడంతో పసికందును ఐసీయూలో ఉంచారు. 18వ తేదిన రాత్రి ఐసీయూ నుంచి తీసుకొచ్చి బిడ్డకు పాలు తాగించిన షబానా అలాగే నిద్రపోయింది. లేచి చూసేసరికి బిడ్డ మాయమైంది. పోలీసులు ఆస్పత్రి సీసీ పుటేజ్ను పరిశీలించగా ఉదయం 5.17గంటల సమయంలో ముగ్గురు మహిళలు ఆస్పత్రి బయటకు వెళ్లడం గుర్తించారు. వీరే బిడ్డను తీసుకెళ్లి వుంటారని అనుమానిస్తున్నారు.