Chittoor: వర్షంలోనూ చంద్రబాబుకు విశేష ఆదరణ

ABN , First Publish Date - 2022-07-07T00:04:59+05:30 IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లెలో పర్యటిస్తున్నారు. మదనపల్లె గ్రౌండ్‌లో...

Chittoor: వర్షంలోనూ చంద్రబాబుకు విశేష ఆదరణ

చిత్తూరు (Chittoor): ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Ap Ex Cm Nara Chandrababu Naidu) మదనపల్లెలో పర్యటిస్తున్నారు. మదనపల్లె గ్రౌండ్‌లో టీడీపీ మినీ మహానాడు (Tdp Mini Mahanadu) కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం మదనపల్లెలో వర్షం కురుస్తోంది. అయితే టీడీపీ మినీ మహానాడు సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సభకు హాజరయ్యారు.


అంతకుముందు మదనపల్లె (Madanapalle)కు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. మదనపల్లె నుంచి టీడీపీ మినీ మహానాడు సభ వద్దకు రోడ్ షో నిర్వహించారు. అయితే చంద్రబాబు సభకు భారీగా జనాలు తరలిరావడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతల సభల నుంచి ప్రజలు వెళ్లిపోతుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు భారీగా జనాలు వస్తుండటంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. 






Updated Date - 2022-07-07T00:04:59+05:30 IST