చిత్తూరు గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తాం: CK babu
ABN , First Publish Date - 2022-04-12T17:15:00+05:30 IST
చిత్తూరు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వంశ పారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తెలిపారు.
చిత్తూరు: చిత్తూరు గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వంశ పారంపర్యం ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కరోనా కారణంగా రెండేళ్లు జాతర నిర్వహించలేక పోయామని అన్నారు. ఈ సారి ఘనంగా జాతరను నిర్వహిస్తామని... అందుకు అందరూ సహకరించాలిని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంగమ్మ జాతర తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తామని తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయం మేరకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తామన్నారు. రెండేళ్ల తర్వాత మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉత్సాహంగా కనిపించారు.