శ్రీసిటీలో చైనా మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ
ABN , First Publish Date - 2021-03-04T06:08:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ సెజ్లో మరో భారీ మెట్రో రైలు కోచ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. చైనాకు చెందిన సీఆర్ఆర్సీ అనుబంధ సంస్థ సీఆర్ఆర్సీ ఇండియా 45.3 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తోంది
రూ.350 కోట్ల పెట్టుబడి
తడ: ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ సెజ్లో మరో భారీ మెట్రో రైలు కోచ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. చైనాకు చెందిన సీఆర్ఆర్సీ అనుబంధ సంస్థ సీఆర్ఆర్సీ ఇండియా 45.3 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం బుధవారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. దాదాపు 500 మందికి ఈ యూనిట్లో ఉపాధి లభించనుంది.