సిద్దిపేట: జిల్లాలో విషాదం నెలకొంది. తొగుట మండలంలోని వెంకట్రావ్పేటలో సంవత్సరం వయస్సున్న పాప విద్యుదాఘాతంతో మృతి చెందింది. పాప తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పాపకు తండ్రే కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.