కార్మిక భవన్‌ కోసం స్థలం కేటాయించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:16:47+05:30 IST

కార్మిక భవన్‌ కోసం స్థలం కేటాయించాలి

కార్మిక భవన్‌ కోసం స్థలం కేటాయించాలి

పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో చీఫ్‌విప్‌ సమీక్ష


హన్మకొండ టౌన్‌, జూన్‌ 23: హన్మకొండలో కార్మిక భవన్‌, ఆటో భవన్‌ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును కోరారు. బుధవారం హన్మకొండలోని కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో వినయభాస్కర్‌ సమావేశమై పశ్చిమ నియోజకర్గ అభివృద్ధిపై సమీక్షించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. బోడగుట్ట నుంచి దర్గా వరకు రోడ్డు నిర్మాణానికి ప్రఽణాళికలు రూపొందించామని తెలిపారు. రెవెన్యూ కాలనీలో శ్మశాన వాటికను నిర్మించాలని కోరారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల కోసం స్థలం కేటాయించాలన్నారు.  

Updated Date - 2021-06-24T05:16:47+05:30 IST