ప్రజాతీర్పుకు సమాధి కట్టిన వైసీపీ: వెంకటరాజు

ABN , First Publish Date - 2021-03-05T09:37:45+05:30 IST

ప్రజల మద్దతు లేకుండా 570 మున్సిపల్‌ వార్డులు ఏకగ్రీవమయ్యాయని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర

ప్రజాతీర్పుకు సమాధి కట్టిన వైసీపీ: వెంకటరాజు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రజల మద్దతు లేకుండా 570 మున్సిపల్‌ వార్డులు ఏకగ్రీవమయ్యాయని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు ఎద్దేవా చేశారు. ప్రజాతీర్పుకు సమాధి కట్టి, ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులు, దౌర్జన్యాలతో చేసుకున్న ఏకగ్రీవాలకు ప్రజా మద్దతు ఉంటుందా అని గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-05T09:37:45+05:30 IST