నేడు చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-29T15:35:30+05:30 IST

నేడు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

నేడు చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వ వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. జర్మనీ పాస్ పోర్ట్, పౌరసత్వంపై హైకోర్టు నేడు ప్రశ్నించనుంది. చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ నేడు మరోసారి వాదనలు వినిపించనున్నారు. సిటిజన్ షిప్ యాక్ట్ నిబంధనలు, వాటి ఉల్లంఘనపై ఓసీఐ కార్డ్ అనుమతులపై చెన్నమనేని తరపు న్యాయవాది  హైకోర్టు‌కు వివరణ ఇవ్వనున్నారు.

Updated Date - 2021-12-29T15:35:30+05:30 IST