చెన్నైపై ఢిల్లీ విజయం
ABN , First Publish Date - 2020-09-26T04:39:18+05:30 IST
ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. స్లోపిచ్ పిచ్పై ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలి నుంచీ మ్యాచ్లో...
దుబాయ్: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం సాధించింది. స్లోపిచ్ పిచ్పై ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తొలి నుంచీ మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించారు. దీంతో పరుగులు రాబట్టేందుకు చెన్నై బ్యాట్స్మెన్ చెమటోడ్చాల్సి వచ్చింది. 176 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో టోర్నీలో ఢిల్లీ జట్టు రెండో విజయం నమోదు చేసింది. 44 పరుగుల తేడాతో చెన్నైపై విజయ ఢంకా మోగించింది.
టోర్నీలో రెండు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ.. రెండింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ దిగ్గజ జట్లకు సైతం షాకిస్తోంది.