రాజేంద్రనగర్లో మళ్లీ చిరుత కలకలం
ABN , First Publish Date - 2020-05-29T16:16:35+05:30 IST
రాజేంద్రనగర్లో చిరుతపులి సంచరించడం మరోసారి కలకలం రేపుతోంది.
హైదరాబాద్: రాజేంద్రనగర్లో చిరుతపులి సంచరించడం మరోసారి కలకలం రేపుతోంది. జయశంకర్ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ సమీపంలోని చిరుత తిరగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో వర్సిటీ సెక్యూరిటీగార్డులు ఉలిక్కిపడ్డారు. ఆ ప్రాంతంలోనే గ్రేహౌండ్స్ పోలీసుల శిక్షణ కేంద్రం ఉండటంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు.