పక్కాగా కంపెనీల చిరునామాల పరిశీలన

ABN , First Publish Date - 2022-08-20T06:11:03+05:30 IST

అల్లాటప్పా కంపెనీలకు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇక రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) నేరుగా కంపెనీలు ఇచ్చిన

పక్కాగా కంపెనీల చిరునామాల పరిశీలన

న్యూఢిల్లీ : అల్లాటప్పా కంపెనీలకు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇక రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) నేరుగా కంపెనీలు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి, ఆ చిరునామా నిజమా? కాదా? అనే విషయాన్ని ఇద్దరు స్థానిక సాక్షుల సమక్షంలో చెక్‌ చేయవచ్చు. ఇందుకోసం అవసరమైతే స్థానిక పోలీసుల సహాయమూ తీసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ నమోదిత కార్యాలయం ఆర్‌ఓసీకి తెలిపిన అడ్రస్‌లో ఉందీ లేనిదీ ఫోటో తీసుకుని అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా ఉన్నా, ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసి.. వాటి  పేర్లను నమోదిత కంపెనీల జాబితా నుంచి తొలగించవచ్చు. ఇందుకు సంబంధించి కంపెనీల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Updated Date - 2022-08-20T06:11:03+05:30 IST