కేటీఆర్‌ దందాకు చెక్‌: అర్వింద్‌

ABN , First Publish Date - 2022-01-08T01:37:19+05:30 IST

మంత్రి కేటీఆర్‌ దందాకు చెక్‌పెట్టే మెకానిజాన్ని ఎఫ్‌సీఐ తీసుకొచ్చిందని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేటీఆర్‌ దందాకు చెక్‌: అర్వింద్‌

ఢిల్లీ: మంత్రి కేటీఆర్‌ దందాకు చెక్‌పెట్టే మెకానిజాన్ని ఎఫ్‌సీఐ తీసుకొచ్చిందని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బియ్యం సేకరణలో జరుగుతున్న రీసైకిల్ దందా ఖేల్ ఖతమన్నారు. ఈ రసాయనంతో పరీక్షిస్తే బియ్యం ఎంత పాతవో తెలిసిపోతుందని చెప్పారు. బియ్యం సేకరణలో ఈ విధానాన్ని ఎఫ్‌సీఐ తప్పనిసరి చేసిందన్నారు. పసుపు పంటకు పునర్‌వైభవం తెచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒక్క విమర్శ చేసినందుకే డీజీపీ మహేందర్‌రెడ్డి తనపై ఇన్ని కేసులు వెతికి మరీ పెట్టారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ఎంపీలపై కార్టూన్స్ పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? అని ప్రశ్నించారు. 22 చోట్ల తాను ఫిర్యాదు చేశానని, మరి ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డి సమాధానం చెప్పాలని అర్వింద్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-08T01:37:19+05:30 IST