‘టిడ్కో’ ఉచితమని ఇప్పుడు మోసం?: టీడీపీ

ABN , First Publish Date - 2020-11-30T09:29:45+05:30 IST

టిడ్కో ఇళ్లను అందరికీ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు మభ్యపెట్టిన జగన్‌ రెడ్డి ఇప్పుడు కొందరికి మాత్రమే ఉచితంగా ఇస్తామని చెప్పడం పచ్చి మోసమని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది.

‘టిడ్కో’ ఉచితమని ఇప్పుడు మోసం?: టీడీపీ

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్లను అందరికీ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు మభ్యపెట్టిన జగన్‌ రెడ్డి ఇప్పుడు కొందరికి మాత్రమే ఉచితంగా ఇస్తామని చెప్పడం పచ్చి మోసమని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఆదివారం పార్టీ అధికార ప్రతినిధి మహ్మద్‌ నజీర్‌ మాట్లాడుతూ.. ‘టిడ్కో ఇళ్లను అందరికీ ఉచితంగా ఇస్తామని జగన్‌రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇప్పుడు కేవలం 300 అడుగుల ఇళ్లను మా త్రమే ఉచితంగా ఇస్తామని, మిగిలిన వాటికి మొత్తం డబ్బులు చెల్లించాలని చెబుతున్నారు. ఇలా మోసం చేయడం దుర్మార్గం’ అని విమర్శించారు.


అసమర్థ నేత జగన్‌: అయ్యన్న

‘‘నాయకుడు అసమర్థుడైతే ప్ర జలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోడు. జగన్‌ అలాంటి వాడు. తుఫాన్లతో పం టలు నష్టపోయి, పేదలు సర్వం కోల్పోయి ఉంటే మంత్రులెవరూ కనీసం పరామర్శించలేదు. ముఖ్యమంత్రేమో గాలిలో చక్కర్లు కొట్టి మమ అనిపించారు. జగన్‌ కడప జిల్లాకు ముఖ్యమంత్రా? రాష్ట్రానికా? అనేది అర్థం కావడం లేదు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆదివారం వ్యాఖ్యానించారు.  .

Updated Date - 2020-11-30T09:29:45+05:30 IST