చాను విజయం దేశానికి గర్వకారణం

ABN , First Publish Date - 2021-07-25T07:40:33+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజు భారతదేశానికి రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు

చాను విజయం దేశానికి గర్వకారణం

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అభినందనలు


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజు భారతదేశానికి రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత, మళ్లీ 20 ఏళ్లకు ఒలింపిక్స్‌ పతకం సాధించిన మహిళగా చాను చరిత్ర సృష్టించారన్నారు.  దేశానికి పతకాల సాధనలో శక్తివంతమైన ప్రారంభాన్ని ఇచ్చారని వారు వేర్వేరు ప్రకటనల్లో ప్రశంసించారు.

Updated Date - 2021-07-25T07:40:33+05:30 IST