పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు!

ABN , First Publish Date - 2020-02-20T02:58:33+05:30 IST

పిచ్చి తుగ్లక్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు వినొద్దని పోలీసులకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.

పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు!

హైదరాబాద్ : పిచ్చి తుగ్లక్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు వినొద్దని పోలీసులకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. తప్పు చేస్తే ప్రజాకోర్టులో పోలీసులను శిక్షిస్తామని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 


నేను ఒక్క పిలుపు ఇస్తే..!

ధైర్యముంటే రాజధాని మారుస్తామని ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సింది. రాజధానిలో ఒకే సామాజికవర్గం ఉందని ప్రచారం చేస్తున్నారు. జగన్‌.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. నేను ఒక్క పిలుపు ఇస్తే 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో మరెప్పుడు ఇలాంటిటి జరగదు. రాజధాని రైతులను రోడ్డున పడేశారు. టీడీపీ నేతలపై అట్రాసిటి కేసులు పెడుతున్నారు. ఐదేళ్లలో ఇరిగేషన్‌కు 65 వేల కోట్లు ఖర్చు చేశాం. నదుల అనుసంధానాన్ని పెండింగ్‌లో పెట్టారు. నాలుగైదు రెట్లు ఇసుక ధర పెంచేశారు.. వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. మద్యం ధరలు పెంచాడు.. జే టాక్స్‌ వేశాడు.. కావాలనుకున్న బ్రాండ్లు దొరక్కుండా చేశారుఅని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-02-20T02:58:33+05:30 IST