అందువల్లే కరోనా వ్యాప్తి పెరిగింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-31T23:59:40+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.

అందువల్లే కరోనా వ్యాప్తి పెరిగింది: చంద్రబాబు

గుంటూరు: ఏపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. బాధ్యత నిర్వర్తించమని ప్రభుత్వాన్ని అడిగితే ఎదురుదాడి చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగా చేయడంలేదని, టెస్ట్‌లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని చంద్రబాబు అన్నారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ను కంట్రోల్‌ చేయకపోతే కష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశానని, అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడుతోందని చంద్రబాబు చెప్పారు. మాస్క్‌లు, శానిటైజర్లు అందించలేకపోతున్నారని, రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలు తక్కువగా ఉన్నాయని, కరోనా కంటే మనలోని భయమే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం కౌన్సిలింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని కోరామని చంద్రబాబు తెలిపారు. 


Updated Date - 2020-03-31T23:59:40+05:30 IST