చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలి
ABN , First Publish Date - 2021-05-08T08:42:49+05:30 IST
రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు
రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు: సజ్జల
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు దుష్ప్రచారం వల్లే తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు క్వారంటైన్ ఆంక్షలు విధించాయని ఆరోపించారు. మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం చేస్తుంటే వారిని దండించే రాజకీయానుభవం, వయసు, బాధ్యతాయుత ప్రతిపక్ష నేత హోదా కలిగిన ఆయన.. చిల్లర రాజకీయాలకు పాల్పడితే ఏం చేయాలో.. ఎలా దండించాలో..ఏశిక్ష విధించాలో రాష్ట్రంలోని పౌర సమాజం, మేధావులు, ప్రజలు ఆలోచించాలని కోరారు.