కరోనాను కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: సజ్జల

ABN , First Publish Date - 2020-04-03T21:56:55+05:30 IST

కరోనాను కూడా రాజకీయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారని, టీడీపీ దరిద్రపు, దిక్కుమాలిన వ్యవహారాలు నడుపుతోందని వైసీప నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

కరోనాను కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: సజ్జల

అమరావతి: కరోనాను కూడా రాజకీయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారని, టీడీపీ దరిద్రపు, దిక్కుమాలిన వ్యవహారాలు నడుపుతోందని వైసీప నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కోటి 28 లక్షల ఇళ్లలో సర్వే చేయించామని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి ఉన్నవారిని గుర్తిస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రానికి అదనపు ఆర్థికబారం పడిందని తెలిపారు. ఖాళీ ఖజానాను కొత్త ప్రభుత్వానికి అప్పగించారని, ఉద్యోగ సంఘాలకు పరిస్థితిని వివరించామని తెలిపారు. జీతాలు రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పామన్నారు. టీడీపీ నేతలు చౌకబారు ఆరోపణలతో ఏమీ సాధించలేరని, కోతలు, వడపోతలు పెట్టే ఆలోచన సీఎం జగన్‌కు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Updated Date - 2020-04-03T21:56:55+05:30 IST