LIVE: చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

ABN , First Publish Date - 2020-02-19T18:51:22+05:30 IST

అమరావతి: వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టింది.

LIVE: చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

అమరావతి: వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా, మేదరమెట్లలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు బలైపోతున్న పేదలకు అండగా ఉండేందుకే ప్రజా చైతన్యయాత్రలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తొమ్మిది మాసాల వైసీపీ దుర్మార్గ పాలనలో ఎంతోమంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. గిట్టుబాటు ధరలేక రాష్ట్రంలో 290 మంది రైతులు, ఇసుక కొరతతో 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 45 మంది రైతులు, రైతుకూలీలు వేదన భరించలేక ప్రాణాలొదిలారని, ప్రజలను బతికించే ప్రభుత్వాలను ఇప్పటివరకు చూశామని, చరిత్రలో తొలిసారి ప్రజలను చంపే పాలకులను ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు మండిపడ్డారు. ఏబీఎన్ లైవ్...

Updated Date - 2020-02-19T18:51:22+05:30 IST