అది చంద్రబాబు ప్లాన్ అనుకోవచ్చు కదా?: బొత్స

ABN , First Publish Date - 2022-01-03T02:06:14+05:30 IST

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విషయాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, అది టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ అనుకోవచ్చు కదా

అది చంద్రబాబు ప్లాన్ అనుకోవచ్చు కదా?: బొత్స

విశాఖ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విషయాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, అది టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ అనుకోవచ్చు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చినా రాధా తిరస్కరించారని తెలిపారు. సినిమా టికెట్ల విషయంలో గగ్గోలు పెడుతున్నారని తప్పుబట్టారు. ఏదో విధంగా రాద్ధాంతం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. విశాఖలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే.. కోర్టుల్లో కేసులు వేసి స్థలం ఇవ్వకుండా అడ్డు తగిలారని విమర్శించారు. స్వచ్ఛ అమృత్ మిషన్‌లో 10 అవార్డులు వచ్చాయని, ఇవి గ్రాఫిక్స్ చూపిస్తే వచ్చిన అవార్డులు కాదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-01-03T02:06:14+05:30 IST