టీడీపీ నేత అరవింద్‌బాబుకు చంద్రబాబు ఫోన్‌

ABN , First Publish Date - 2022-01-16T01:25:12+05:30 IST

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌బాబుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన అరవింద్‌బాబు

టీడీపీ నేత అరవింద్‌బాబుకు చంద్రబాబు ఫోన్‌

నరసరావుపేట: నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌బాబుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన అరవింద్‌బాబు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడి అరవింద్‌ ఆరోగ్య పరిస్థితి చంద్రబాబు తెలుసుకున్నారు. అరవింద్‌బాబుకు మెరుగైన వైద్యం అందించాలని అధినేత కోరారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఆందోళన చేస్తున్న అరవింద్‌బాబును బూటుకాలుతో పోలీసులు తన్నారు. బూటుకాలుతో తన్నడంతో ఆయన సృహతప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ శ్రేణుల దాడికి దిగారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది.

Updated Date - 2022-01-16T01:25:12+05:30 IST