రేపటి నుంచి టీడీపీ చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష
ABN , First Publish Date - 2021-10-20T20:03:27+05:30 IST
రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నారు. 36 గంటలపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్ష చేయనున్నారు.
అమరావతి: రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నారు. 36 గంటలపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు. పార్టీ కీలక నేతల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష సమయంలో ప్రతినిధి బృందం గవర్నర్ను కలవనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షాను టీడీపీ నేతలు కలవనున్నారు.