డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2020-09-28T02:33:28+05:30 IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను..

డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: డీజీపీ సవాంగ్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు పేర్కొన్నారు. దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జడ్జి రామకృష్ణ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించిన మరుసటిరోజే ఈ దాడి జరిగిందన్నారు. వైసీపీ ప్రోద్భలంతో జడ్జి రామకృష్ణ గొంతు నొక్కడంలో భాగంగానే కుట్ర పూరితంగా ఈ దాడి జరిగిందని రుజువు అవుతోందని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-09-28T02:33:28+05:30 IST