Amaravati: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-07-16T00:46:23+05:30 IST

సీఎస్‌ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరిలో నారాయణ మృతిపై విచారణ జరపాలని

Amaravati: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: సీఎస్‌ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరిలో నారాయణ మృతిపై విచారణ జరపాలని లేఖ (Letter)లో డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు లక్ష్యంగా పోలీసుల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రోద్బలంతోనే నారాయణను చిత్రహింసలు పెట్టారని తెలిపారు. నారాయణ పోస్టుమార్టం నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నారాయణ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. సీఎస్‌కు రాసిన లేఖ ప్రతిని డీజీపీకి కూడా చంద్రబాబు పంపారు.

Updated Date - 2022-07-16T00:46:23+05:30 IST