జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-09T01:19:51+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంపదనంతా కుక్కలపాలు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.

జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంపదనంతా కుక్కలపాలు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పు చేస్తున్న పోలీసులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండేళ్లలో ఇంత అప్రతిష్టపాలైన ప్రభుత్వం ప్రపంచంలో లేదని దుయ్యబట్టారు. పిచ్చి తుగ్లక్‌ను ఇప్పుడు పిచ్చి జగన్ రూపంలో చూస్తున్నామని చెప్పారు. తుగ్లక్ జుట్టుపై పన్ను వేస్తే.. జగన్ రెడ్డి చెత్తపై పన్ను వేస్తున్నారని ధ్వజమెత్తారు. అఫ్ఘానిస్థాన్ నుంచి నేరుగా తాడేపల్లికి డ్రగ్స్ వస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రానికి జరగరాని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-09T01:19:51+05:30 IST