భయపడితే బానిసలుగా మిగులుతారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-09-04T02:25:28+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును మత్స్యకార సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు టీడీపీ

భయపడితే బానిసలుగా మిగులుతారు: చంద్రబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును మత్స్యకార సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు టీడీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జీఓ నెం.217తో మత్స్యకారుల మెడకు ఉరిబిగించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఓపెన్ ఆక్షన్‌తో మత్స్యకారుల చేపల చెరువులను ఆక్రమించేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కులవృత్తిదారుల పొట్టగొట్టేలా వైసీపీ ప్రభుత్వం రోజుకో జీఓ తెస్తోందని విమర్శించారు. కోర్టులో కేసు కొనసాగుతుంటే జీఓలు ఎలా ఇస్తారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. చేపల చెరువులు మత్స్యకార సొసైటీలకే చెందాలన్నారు. ప్రభుత్వ అడ్డగోలు జీఓలపై ఉద్యమిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పారు. భయపడితే బానిసలుగా మిగులుతారని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2021-09-04T02:25:28+05:30 IST