రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-05T08:36:23+05:30 IST

రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు

రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో ఆజాదీ కా అమృతోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆయన వెళ్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి చంద్రబాబును కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు వివిధ రంగాల ప్రముఖులను దీనికి ఆహ్వానించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్న ఆయన మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత అమృతోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రాత్రికి తిరిగి వస్తారు. 

Updated Date - 2022-08-05T08:36:23+05:30 IST