ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2022-09-14T23:26:46+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఉమ్మడి జిల్లాల పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అనంతపురం
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఉమ్మడి జిల్లాల పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అనంతపురం (Anantapuram), శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 21న శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో జరిగే మినీ మహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. 22న పుట్టపర్తిలో ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ ముఖ్యులతో సమీక్ష చేస్తారు. 23న అనంతపురం జిల్లాలో బాదుడే... బాదుడు కార్యక్రమం నిర్వహించనున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని శింగనమల లేదా గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలా? లేదా రెండు నియోజకవర్గాల్లోనూ నిర్వహించాలా అన్న యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనపై రెండు రోజుల్లోగా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.