టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-02-24T01:13:14+05:30 IST

కలిసి ముందుకెళ్తే టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదు: చంద్రబాబు

అమరావతి: కలిసి ముందుకెళ్తే టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం అభినందనీయమన్నారు. సమష్టిగా పోరాడి ఘన విజయాన్ని అందుకున్నామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని నాయకులకు చంద్రబాబు సూచించారు.


పంచాయతీ ఎన్నికల మాదిరిగా ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం మున్సిపల్ ఎన్నికల్లో కుదరదని చంద్రబాబు తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్ ఉపసంహరణలు, ప్రలోభాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. కలిసి ముందుకెళ్తే టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదన్నారు. 




వైసీపీ నేతల అక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. విశాఖలో విజయసాయి చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖను అరాచకానికి చిరునామాగా మార్చారని ఆయన విమర్శించారు. జగన్‌రెడ్డి అరాచకాలను ఎదుర్కొనేందుకు టీడీపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2021-02-24T01:13:14+05:30 IST